‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌లో కనిపించని అనుష్క.. రీజన్ వెల్లడించిన నవీన్ పోలిశెట్టి

by Disha Web Desk 6 |
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌లో కనిపించని అనుష్క.. రీజన్ వెల్లడించిన నవీన్ పోలిశెట్టి
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై పి.మహేష్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ప్రతీ ఒక్క యాక్టివిటీలో నవీన్ మాత్రమే కనిపిస్తున్నాడు తప్ప, అనుష్క ఎక్కడా హాజరు కావడం లేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నవీన్ పోలిశెట్టి అనుష్క ప్రమోషన్లకు దూరంగా ఎందుకు ఉంటుందో వెల్లడించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘అనుష్క అవుట్ ఆఫ్ ది స్టేషన్‌లో ఉంది. కానీ ఆమె ఒక గ్రూప్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఇందుకు సంబంధించిన వీడియో త్వరలో రిలీజ్ చేస్తాం. ఆమె ప్రమోషన్స్‌కు అటెండ్ కాకపోయినా నావంతుగా నేను సినిమాను ప్రమోట్ చేస్తున్న’ అంటూ చెప్పుకొచ్చాడు నవీన్.

Read More: పవన్ కల్యాణ్ ఆ లోపం వల్లే సీఎం కావడం లేదు.. హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed